ఓకే గదిలో అంగన్వాడి కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయం.

• శిథిలావస్థలో ఉన్న భవనంలోనే నిర్వాహణ….
• అదనపు తరగతి గదిలో గ్రామపంచాయతీ కార్యాలయం నిర్వాహణ…..
• 8 ఎండ్లుగా పూర్తికాని గ్రామపంచాయతీ భవనం…
•పనుల పురోగతి పై నామ మాత్రంగానే పంచాయతి రాజ్ శాఖ అధికారుల పర్యవేక్షణ.
దౌల్తాబాద్, జూలై 27 జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలోని కోనాపూర్ గ్రామ అంగన్ వాడి కేంద్రం పరిస్థితి అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు పెచ్చులు ఊడి నీళ్ళు,తేమ లోపలికి వచ్చి పిల్లలకు ఇబ్బంది అవుతుంది. గ్రామ పంచాయితీ భవనం 2014 లో 12 లక్షల వ్యయం తో ప్రారంభమై నేటికీ అసంపూర్తిగానే ఉన్నందున తాత్కాలికంగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పాఠశాల కోసం నిర్మించిన అదనపు తరగతి గదిలో నిర్వహిస్తున్నారు. ఫలితంగా శిథిలావస్థకు చేరిన భవనంలోనే అంగన్వాడీ కేంద్రాన్ని నడుపుతున్నారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు అంగన్వాడీ భవనం దెబ్బతినడంతో ఒకే భవనంలో గ్రామ పంచాయతీ కార్యాలయం, అంగన్వాడి కేంద్రం ఓకే గదిలో నిర్వహిస్తున్నారు.
ఇకనైనా సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ఎమ్మెల్యే చొరవతీసుకొని నిర్మాణం పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.