ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు ప్రారంభం.

ఈఓ గోవిందరాజులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై18(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ విధానంలో 2022-23 సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో నేటి నుండి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని డీఈవో గొవిందరాజులు, ఓపెన్ స్కూల్ జిల్లా కో-ఆర్డినేటర్‌ నాగరాజు సోమవారం  సంయుక్త ప్రకటనలో తెలిపారు.నేటి నుంచి
ఆగస్టు నెల 14వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అడ్మిషన్లు పొందవచ్చన్నారు.పూర్తి వివరాలకు 9440471311 నంబరును సంప్రదించాలని వారు కోరారు
.