కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలికంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

 రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణ  మున్సిపాలిటీ ఆరవ వార్డు శేషపల్లి ప్రైమరీ పాఠశాల లో  కంటి వెలుగు కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్, వైస్ చైర్మన్ ఎర్రం విధ్యా సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ,   కమీషనర్ వెంకట నారాయణ, మేనేజర్ నాగరాజు, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్,  పట్టణ ఇంఛార్జి గాండ్ల సమ్మయ్య లు సంయుక్తంగా ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని,  భగత్ సింగ్ నగర్  హాట్స్ లో ఈ  కార్యక్రమం బుధవారం ఉంటుందనీ తెలిపారు. అనంతరం పట్టణ అధ్యక్షులుగా  బాధ్యత లు చేపట్టిన అబ్దుల్ అజీజ్ ,పట్టణ ఇంఛార్జి గాండ్ల సమ్మయ్యలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు  యాకుబ్ ఆలీ  మాజీ జడ్పీటీసీ  ఆసాల రాజన్న కౌన్సిలర్ లు జాడి శ్రీనివాస్, జిలకర మహేష్,  పోగుల మల్లయ్య, పుల్లూరి సుధాకర్, రేవెల్లి ఓదేలు, అనిల్ రావు, పారుపల్లి తిరుపతి, గడ్డం సంపత్, సీనియర్ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్, గోపు రాజం, నక్క శ్రీనివాస్, యువ నాయకులు సత్యపాల్, జక్కబోయిన కుమార్, ఎర్రబెల్లి రాజేష్, మాదాస్ రాజు కరుణాకర్,  చంద్రకిరణ్, సాంబార్ శేఖర్, మెరాజ్, ప్రసాద్, మురళీ,  శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.