కంటి వైద్యం కోసం ఆర్.వి.ఎమ్ ఆసుపత్రికి తరలింపు..

సిద్దిపేట జిల్లా మద్దూరు వల్లంపట్ల గ్రామంలో కంటి చూపుతో కిడ్నీల రాళ్లతో బాధపడుతున్న వారిని గ్రామ సర్పంచ్ ఆలేటి రజిత-యాదగిరి ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవల కోసం శుక్రవారం వంటిమామిడిలోని అర్.వి.ఎమ్ ఆసుపత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్ ఆలేటి రజిత యాదగిరి ఈ సందర్భంగా కో-ఆపరేటివ్ సొసైటీ జిల్లా డైరెక్టర్ ఆలేటి యాదగిరి మాట్లాడుతూ.. గ్రామంలో అనారోగ్య సమస్యలతో కంటి చూపు, కిడ్నీలో రాళ్లు ఇతర సమస్యలపై ప్రజలు బాధపడుతున్నారని గుర్తించి ఉచిత వైద్యం కోసం ఆర్.వి.ఎమ్ హాస్పిటల్ కి పంపిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేందర్, గ్రామస్తులు బోడపట్ల రమేష్, చిట్కూరి పెద్దరాములు, బోడపట్ల కొమురెల్లి,బోడపట్ల అంజనేయులు, చింతల కర్ణాకర్ రెడ్డి, బొడ్డు రాములు, నరసయ్య, కారోబార్ వేణు, తదితరులు పాల్గొన్నారు