కట్టుకున్న వాడే కాలయముడుయి కడతేర్చాడు అనుమానంతో భార్యను చంపిన భర్త

అనాదలు అయిన పసిపిల్లలు జులై 18 (జనంసాక్షి ) గట్టు   మండల పరిధిలోని మాచర్ల గ్రామంలో సోమవారం తెల్లవారుజామున మాచర్ల గ్రామానికి చెందిన మాల పర్వతమ్మ 35 హత్యకు గురి అయింది గట్టు ఎస్సై పవన్ కుమార్ కథనం ప్రకారం భర్త తాయప్ప అనుమానంతో భార్యను హత్య చేసినట్లు ఎస్సై తెలియజేశారు  గతంలో నాలుగు సార్లు పంచాయతీలు కూడా నిర్వహించినట్లు తెలియజేశారు ఆదివారము రోజు వారి యొక్క తల్లిదండ్రుల ఐజ స్వగ్రామ్ దగ్గర పంచాయతీ చేసి భర్త వెంబడి పంపించారు సోమవారం తెల్లవారుజామున హత్య చేసినట్లు ఎస్సై తెలియజేశారు మాచర్ల బలిగేరా మధ్యన నరసప్ప గుడి వెనకాల మృతదేహం లభ్యమయింది ఎస్సై సంఘటన స్థలానికి వెళ్లి శవాన్ని పరిశీలించి అనంతరం గద్వాల సీఐ చంద్రశేఖర్ కు తెలియజేశారు  ఆయన వచ్చి శవాన్ని పరిశీలించి పోస్టుమార్టం కొరకు గద్వాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు మృతిరాలు అక్క సరోజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలియజేశారు  మృతురాలికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నట్లు తెలియజేశారు అనుమానం వల్ల తల్లి హత్య తండ్రి కటకటాలపాలు పసిపిల్లలు అనాథలు అయ్యరని గ్రామస్థులు విచారం వెలిబుచ్చారు