కని పెంచిన తండ్రీ పాలిట కన్న కొడుకే కాల యముడు అయ్యాడు

అచ్చంపేట ఆర్సీ,అక్టోబర్08,(జనం సాక్షి న్యూస్ ): నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలం డిసి తండా లో కన్న తండ్రి ని కొడుకు గొడ్డలితో నరికి చంపిన దారుణం శుక్రవారం రాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం మృతుడు జెర్పుల జెముల నాయక్ కు ఏడుగురి సంతానం లో ఐదుగురు కొడుకు లు,ఇద్దరు కుమార్తెలు ఇందులో నాలుగో కుమారుడు నెహ్రూ నాయక్ హైదరాబాద్ లో పనిచేస్తున్నాడని దసరా పండగ సందర్భంగా స్వంత గ్రామానికి వచ్చాడని ఇదే క్రమంలో నాలుగవ కొడుకు నెహ్రూ నాయక్ తండ్రి జెమ్లా నాయక్ తో కుటుంబ తగాదాల విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగగా క్షణికావేశం లో తండ్రి ని అత్యంత పాశవికంగా గొడ్డలితో దాడి చేసి నరికి హత్య చేశాడని విషయం తెలుసుకున్న లింగాల ఎస్సై సంఘటన స్థలిని చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.