కన్నుల పండుగగా తిమ్మప్ప స్వామి కళ్యాణం

మల్దకల్ అక్టోబర్ 9 (జనంసాక్షి) హరిహర క్షేత్రం ఆదిశీలలో ఉద్భవించిన శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా తిమ్మప్ప స్వామి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. దేవాలయ చైర్మన్,వ్యవస్థాపక వంశీయులు కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు, కార్యనిర్వహణాధికారి సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రమేష్ ఆచారి,ధీరేంద్ర దాస్, మధుసూదనాచారి,రవి వేదమంత్రాలతో శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుని కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా భక్తులకు గద్వాల మండలం చేనుగోని పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ రెడ్డి కళ్యాణం జరిపించారు.ఈ సందర్భంగా ఆదిశేలాక్షేత్ర యోగేశ్వర భజన బృందం వారిచే భజన కార్యక్రమాలు నిర్వహించగా వారికి మాజీ ఎంపీపీ తాటికుంట మధుసూదన్ రెడ్డి రూ 5,116 సంభావన అందజేశారు.ఈ కార్యక్రమంలోవాల్మీకి పూజారులు,బాబురావు, చంద్రశేఖరరావు,శీను తదితరులు భక్తులు పాల్గొన్నారు.