కరాచీలో ఎన్నికల కార్యాలయం వద్ద పేలుడు.. ఐదుగురి మృతి

ఇస్లామాబాద్‌ : ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌లో హింస చెలరేగింది. కరాచీలోని ఏఎస్‌పీ ఎన్నికల కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలి వద్ద అధికారులు, భద్రతాసిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.