కరెంటు పోల్ పై నుండి పడి వ్యక్తి మృతి
“జనం సాక్షి “చిన్న శంకరంపేట్” జులై 23, మండల పరిధిలోని గజగట్లపల్లి గ్రామానికి చెందిన బర్మల యాదగిరి (45) కరెంటు పోల్ పై నుండి పడి మృతి చెందాడు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం యాదగిరి రోజువారి కూలీగా చిన్న శంకరంపేట్ మండల కాంట్రాక్టర్ దగ్గర రోజు వారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు రోజులాగే పని నిమిత్తం తూప్రాన్ మండలంలో బ్రాహ్మణపల్లి గ్రామంలో పనులు నిర్వహిస్తుండగా కరెంటు స్తంభం పై నుండి పడడంతో గాయాలు కావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి తరలించి వారం రోజులపాటు చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి రెండు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు
