కరోనా వ్యాక్సిన్‌ అపోహల్లో జనం

వ్యాక్సిన్‌కు దూరంగా 4కోట్ల మంది
లోక్‌సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢల్లీి,జూలై23(జనంసాక్షి): కరోనా వైరస్‌ ను ఎదుర్కొనేందుకు ఉచిత వ్యాక్సిన్‌ ను రెండు విడుతలుగా పంపిణీ చేసి.. మూడో విడుత బూస్టర్‌ డోస్‌ ను కూడా పంపిణీని ప్రారంభిస్తున్న తరుణంలో కొత్త విషయం బయటపడిరది. దేశంలో ఇప్పటికీ 4 కోట్ల మంది ఒక్క డోస్‌ కూడా వ్యాక్సిన్‌ వేసుకోలేదని తెలుస్తోంది. రకరకాల అపోహలో కొంత మంది వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ఆసక్తి చూపనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై లోక్‌ సభలో పలువురు సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. అలాంటి వారు దేశ వ్యాప్తంగా 4 కోట్ల మంది ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇదే విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ లోక్‌ సభలో సభ్యులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు విడుతలుగా 178,38,52,566 డోసులు (దాదాపు 97.34శాతం) ఉచితంగా పంపిణీ చేశామని ఆయన వివరించారు. దేశంలో కరోనా వ్యాక్సిన అందుబాటులోకి వచ్చింది మొదలు ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు.. 18 నుంచి 60 ఏళ్ల వయసున్న వారికి ఉచితంగా వాక్సిన్‌ వేస్తున్నామని ప్రస్తావించారు. చాలా చోట్ల గ్రామ స్థాయిలో.. ఇంటింటికీ తిరిగి మరీ వ్యాక్సిన్‌ ఇచ్చారు. మొదటి రెండు విడుతలుగా వ్యాక్సిన్‌ పంపిణీ చేసి తాజాగా బూస్టర్‌ డోస్‌ కూడా పంపిణీ ప్రారంభించారు. ఈనెల 15 నుంచి దేశ వ్యాప్తంగా అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా 18 నుంచి 59 ఏళ్ల వరకు ముందు
జాగ్రత్తగా బూస్టర్‌ డోస్‌ ను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి వివరించారు.
్గªళిశంలో లాంగ్‌ కోవిడ్‌ బాధితులు 20 శాతంలోపే ఉన్నారని.. చాలా రాష్టాల్ల్రో 10 శాతం లోపే ఉన్నట్లు గుర్తించామని కేంద్ర మంత్రి తెలిపారు. దీర్ఘకాల వ్యాధులతో కొవిడ్‌ బారిన పడి.. వైద్యుల చికిత్స అనంతరం కోలుకుని.. తిరిగి అస్వస్థతకు గురవుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశామని కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ వివరించారు.