కర్ణాటకకు ఆంటోనీ, అంబికా సోనీ
ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎ.కె. ఆంటోనీ , అంబికా సోనీలు నేడు బెంగళూరు చేరుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలతో సంప్రదింపుల నిమిత్తం వారు బెంగళూరు వస్తుండడంతో ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్న సిద్ధరామయ్య తన ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకున్నట్లు సమాచారం.