కల్తీ పాల తయారు కేంద్రాన్ని గుట్టురట్టు చేసిన బొమ్మలరామారం పోలీసులు

బొమ్మల రామారం. జనం సాక్షి
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చౌదర్ పల్లి గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను పక్కా సమాచారంతో పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించామని ఎస్ఐ వెంకన్న విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ పాలు తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులు చౌదర్ పల్లి గ్రామానికి చెందిన నముడ్ల రాజు, నముండ్ల లక్ష్మయ్య, కళ్లెం రవీందర్ రెడ్డి,తునికి హరి స్వామి, అనువారిని పట్టుకొని వారి వద్ద నుండి 140 లీటర్ల కల్తీ పాలు మూడు మురళి మిల్క్ పౌడర్ ప్యాకెట్స్, మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ అర్ధ లీటర్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఆయన అన్నారు. ఈ నలుగురిలో ఇద్దరు పాల వ్యాపారం చేసేవారు ఉండగా మరొకరు కూలి పని మరొకరు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నారని తెలియజేశారు.