కవితపై మోటివేడెటడ్‌ కేసు


బెయిల్‌ రాకతో మరోమారు స్పష్టం
బిఆర్‌ఎస్‌ నేతలు తలసాని, దాసోజు శ్రవణ్‌
హైదరాబాద్‌,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు కావడం సంతోషంగా ఉందని మాజీమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. ఇది మోటివేటెడ్‌ కేసని స్పష్టత వచ్చిందన్నారు. 11మందిని అప్రువర్స్‌గా మార్చారన్నారు. వందల కోట్ల కేసని చెప్పి ఒక్క రూపాయి రికవరి చేయలేదని జడ్జిలే స్పష్టంగా చెప్పారన్నారు. బెయిల్‌ వచ్చిన తర్వాత కొందరు చేస్తున్న కామెంట్స్‌ మంచిది కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. బాధ్యతగల వ్యక్తులు మాట్లాడటం మంచిదికాదన్నారు. కేసులో ఉన్నవారందరికీ బెయిల్‌ వచ్చిందని.. కవితకు ఎలా బెయిల్‌ వచ్చింది అనడం హాస్యాస్పదమన్నారు. అంటే కవిత పర్మనెంట్‌గా జైల్‌లో ఉండాలా? అంటూ మండిపడ్డారు. న్యాయమూర్తులను అవమానించేలా మాట్లాడటం బాధాకరమని తలసాని శ్రీనివాస్‌ అన్నారు. దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ.. కవితకు బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈడీ ,సీబీఐల దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించాయని.. వారి వ్యాఖ్యలతో ఈ కేసు నిలవదని స్పష్టమైందన్నారు. కవిత ఓ ్గªటైర్‌ అని చెప్పుకొచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక పార్టీ బలోపేతం కోసం ఆమె పోరాటం కొనసాగుతుందన్నారు. బీజేపీతో పొత్తులో భాగంగానే కవితకు బెయిల్‌ వచ్చిందని కాంగ్రెస్‌ నేతలు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలు వాదనకు నిలవవన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామి అని..ఆ పార్టీ నేత సిసోడియాకు ఇదే కేసులో బెయిల్‌ వస్తే కాంగ్రెస్‌ స్వాగతించి కవిత విషయం వచ్చే సరికి వేరే విధంగా మాట్లాడటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియాకు బెయిల్‌ వస్తే బీజేపీ ఆప్‌ కుమ్మక్కయినట్టాఅని ప్రశ్నించారు. తప్పుడు వాదనలతో కాంగ్రెస్‌ ప్రజల్లో మరింత పలుచన కావొద్దని హితవుపలికారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని దాసోజు శ్రవణ్‌ మరోసారి స్పష్టంచేశారు.