కశ్మీర్‌లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు

శ్రీనగర్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):ఉగ్రవాదుల దుశ్చర్యపై యావత్‌ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జమ్మూకశ్మీర్‌ తో పాటు ఇతర ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశం మొత్తం నివాళులర్పిస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం బంద్‌ కొనసాగింది. జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పాక్‌కు వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. అమరుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇక బుద్గాంలో జవాన్ల పార్థివ దేహాలకు సైనికులు నివాళులర్పిస్తున్నారు. కాగా కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బుద్గాం చేరుకొని అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.