కాంగ్రెస్‌,మోత్కుపల్లి వర్గీయుల ఘర్షణ

యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు,మోత్కుపల్లి నర్సింహులు వర్గీయులకు మద్య ఘర్షణ కారణంగా ఉద్రిక్తతకు దారితీసింది. దీంతోమల్లాపురం రోడ్డు పై మోత్కుపల్లి నర్సింహులు బైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు. మోత్కుపల్లి నర్సింహులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి భిక్షమయ్య గౌడ్‌ సమక్షంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు.