కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేస్తే చీకటి రోజులే – మంత్రి కొప్పుల

కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేస్తే చీకటి రోజులే – మంత్రి కొప్పుల

ధర్మపురి ( జనం సాక్షి )ధర్మపురి మండలం రాజారాం, దమ్మన్నపేట, గ్రామాలలో ప్రజా ఆశీర్వాద యాత్ర లో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘన స్వాగతం పలికారు అనంతరం వాడ వాడ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి రాజారాం గ్రామంలో మదీన మస్జిద్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలు మంత్రి సమీక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది రాజారాం, దమ్మన్నపేట, గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 7 కోట్ల 30 లక్షల తో పలు రోడ్లు, ఎరువు గోదాం, కుల సంఘ భవనాలను ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ కాదా అని మంత్రి ప్రశ్నించారు నాడు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దండిగా ఉండే వ్యవసాయం నేడు బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగల మారిందని మంత్రి గుర్తు చేశారు
గతంలో కాంగ్రెస్‌ పార్టీ పాలనలో కరెంటు, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగుచేయకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి, రైతన్నల ఆత్మహత్యలకు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ కాదా
ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బొమ్మరిల్లూలా తీర్చిదిద్దుతున్నా తెలంగాణ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు
తెలంగాణ రైతుల కడుపులు కొట్టేవిధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు.కాంగ్రెస్ పార్టీ పాలనలో 3 గంటల కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకా రైతులు పాముకాట్లకో, మిత్తీల పాట్లకో తన ప్రాంత రైతుబిడ్డలు అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతుంటే.. వారిని ఎట్లా బతికించుకోవాల్నా అని మథనపడిన కేసీఆర్‌ మదిలోంచి పుట్టిన వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ పథకం.
రైతులకు మూడు గంటల కరెంట్‌ చాలన్న వ్యాఖ్యలపై రైతులకు కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై రైతులు గుండెలపై చేతులు వేసుకొని ఆత్మపరిశీల చేసుకోవాలని కోరారు. ఆరు గంటలపాటు కరెంట్‌ ఇస్తానన్న కాంగ్రెస్‌, ఏనాడైనా మూడుగంటల పాటైనా ఇచ్చిందా? అని మంత్రి ప్రశ్నించారు. నాడు నాట్లు వేసే కాలం వచ్చిందంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు, విత్తనాల దుకాణాల ముందు క్యూలైన్లు ఉండేవి కావా అని ప్రశ్నించారు. ఎండకాలం వచ్చిందంటే ఎండిన పంటలు, సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు నిత్యకృత్యమయ్యేవని గుర్తుచేశారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయతో చెరువులను బాగుచేస్తూనే.. మరోవైపు రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలుచేశామని చెప్పారు.నేను మీ బిడ్డ గా అందుబాటులో ఉంటున్నాయి, సేవ చేస్తున్న, ఒక్క సారి ఆశీర్వదిస్తే మీ సేవ లోనే ఉంటా ధర్మపురి నియోజకవర్గం నాకు వ్యవసాయ క్షేత్రం, లో 150 గ్రామాలు నా పొలాలు ఆ పొలాల్ల కలుపు తీసిండ్రా, పంటకు చీడ పురుగులు పడ్డాయా అన్ని
చూసుకోవాలి.స్వరాష్ట్రంలో కేవలం మూడున్నరేండ్లలోనే వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చి అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇంత మంచి కరెంటు వట్టిగనే రాలే.. దాని వెనుక సీఎం కేసీఆర్‌ పడ్డ కష్టం ఎంతో ఉంది.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం బోర్లు, బావులపైనే ఆధారపడి ఉంటుందనేది అక్షరాలా సత్యం
తెలంగాణ రైతులు తమ పంటలు సాగు చేసుకునేందుకు.. అదృష్టాన్ని, వరుణదేవున్ని నమ్ముకొనేవారు.
ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే. అలా మార్చడానికి ఉపయోగపడ్డది 24 గంటల నాణ్యమైన పూర్తి ఉచిత విద్యుత్తు.దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. తెలంగాణ పేరు సువర్ణాక్షరాలతో లిఖించిన సమయం. ఇంతటి ఘన విజయం వెనుక.. సీఎం కేసీఆర్‌ అకుంఠిత దీక్ష, పట్టుదల, మార్గదర్శనం, పక్కా ప్రణాళికలు దాగి ఉన్నాయి.వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్‌ను బొందపెడితేనే రైతాంగం అంతా బాగుపడుతుంది
రైతులను కష్టపెట్టిన వారు బాగుపడినట్లు చరిత్రలోనే లేదు
దమ్ముంటే రైతులకు మూడు గంటల కరెంటు ప్రతిపాదనను మ్యానిఫెస్టో లో పెట్టి వచ్చే ఎన్నికల్లో ఓట్లడిగేందుకు రావాలి.
24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా, అందుబాటులో ఎరువులు, పంటలకు గిట్టుబాటు ధరలు అందిస్తున్న ముఖ్యమంత్రికి అండగా ఉందాం