కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అజాది కా గౌరవ్ పాదయాత్ర

ఝరాసంగం ఆగస్టు 13 (జనంసాక్షి) కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అజాది కా గౌరవ్ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. శనివారం మండలం లోని కుప్పా నగర్ నుండి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం వరకు పాద యాత్ర కొనసాగింది. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్ మాట్లాడుతు స్వాతంత్ర్య ఉద్యమ మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పురస్కరించుకుని టిపిసిసి పిలుపుమేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. అంబేద్కర్, బసవేశ్వర, ఛత్రపతి ల్ శివాజి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు గిరిధర్ రెడ్డి, దేవదాసు, వివిధ మండలాల అధ్యక్షులు రామలింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహా రెడ్డి, యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉదయశంకర్ పాటిల్, నియోజకవర్గ అధ్యక్షుడు నరేష్ గౌడ్, ప్రజా ప్రతినిధులు మల్లన్న పాటిల్, శంకర్ పాటిల్, నరేష్ కుమార్, రాం రెడ్డి, నాయకులు సంగ్రామ్ పాటిల్, మారుతీ రావు పాటిల్, ముల్తాని, రాజ్ కుమార్, అష్రఫ్ అలి, సంగన్న ముదిరాజ్, పెంటయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.