*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆజాది కి గౌరవ పాదయాత్ర*
కమ్మర్పల్లి13,ఆగస్టు(జనంసాక్షి ) కమ్మర్పల్లి మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏఐసిసి ఇచ్చిన పిలుపుమేరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొంటున్న ఈ సందర్భంగా ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు .ఇందులో భాగంగా కమ్మర్పల్లి మండలంలో ఆదివారం రోజున చౌట్పల్లి గ్రామం నుండి ఉప్పులూరు గ్రామం వరకు పాదయాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పిసిసి ప్రచారక కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడు,మరియు మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ ,అర్బన్ ఇంచార్జ్ తహేర్ బిన్ హంధాన్ పాల్గొంటారని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి దేవేందర్, మండల కిషన్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకుంట శ్రీనివాస్, గోపిడి లింగారెడ్డి, భాస్కర్ రాజేందర్ రిత్విక్,ప్రదీప్, మోహన్ ,రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
