కాజీపేటకు చేరుకున్న చార్‌థామ్‌ యాత్రికులు

వరంగల్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న చార్‌థామ్‌ యాత్రకులు కాజీపేట రైల్వేే స్టేషన్‌కు చేరుకున్నారు. ఇవాళ రైల్వే స్టేషన్‌ చేరుకున్న వరద బాధిత యాత్రకులకు స్థానిక ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ ఆహారం, మంచినీటి బాటళ్లను అందజేశారు. పది మంది కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ యాత్రికులు కూడా ఇక్కడకు చేరిన వారిలో ఉన్నారు.