కాబూల్ కు ప్రధాని మోదీ

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం ఆఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ చేరుకున్నారు. కాబూల్‌లో రూ.710 కోట్ల వ్యయంతో భారత్‌ నిర్మించిన పార్లమెంట్‌ భవనాన్ని మోదీ ప్రారంభించనున్నారు. పార్లమెంట్‌ భవన నిర్మాణానికి 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పునాదిరాయి వేశారు.