ఘోర రోడ్డు ప్రమాదం

కారు బైక్ ఢీ : మృతి చెందిన వ్యక్తి

జనం సాక్షి, వంగూరు:
మండల కేంద్రంలోని తిప్పారెడ్డిపల్లి గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతనది మాడుగుల మండలo నర్సాయిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (42) గత నాలుగు సంవత్సరాలుగా నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని వెంకటేశ్వర వైన్ షాప్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. తన విధులు నిర్వహించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గురువారం రాత్రి 7: 30 సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో వెంకటేష్ అక్కడికక్కడే మరణించాడు. అది తెలుసుకున్న వంగూర్ఎస్సై కురుమూర్తి వెంటనే అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎస్సై కురుమూర్తి కారును అదుపులోకి తీసుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.