కార్పొరేటర్ పాదయాత్ర.

మల్కాజిగిరి డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నానని కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ అన్నారు.శనివారం పాత నేరెడ్ మెట్ లో ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు.కొత్తగా వేసిన సిసి రోడ్లను,డ్రైనేజి పైప్లైన్ పనులను పరిశీలించారు. మంచినీరు,శానిటేషన్, ధ్వంసమైన రోడ్లు,తదితర సమస్యలను స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.స్థానికులు సూచించిన సమస్యలన్నింటినీ అధికారులతో చర్చించి దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఈ దీపక్,బిజెపి నాయకులు,స్థానికులు పాల్గొన్నారు.