కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేస్తా కార్పొరేటర్

కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ బఠాన్ గూడా మధుర నగర్ కాలనీలలో కార్పొరేటర్ పాదయాత్ర నిర్వహించారు. కాలనీవాసుల సమస్యల పై అడిగి తెలుసుకున్నారు. కాలనీలో సిసి రోడ్లు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లిన కాలనీవాసులు వెంటనే స్పందించిన కార్పొరేటర్  కాలనీలో సిసి రోడ్లు మంచినీటి సౌకర్యం ఏర్పరిచే విధంగా అధికారులకు సూచించారు. డివిజన్లోని ప్రతి కాలనీకి సిసి రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సౌకర్యం వివిధ మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే విధంగా తమ వంతు కృషి చేస్తానని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు డిఈ మహేష్, జలమండలి అధికారులు రమేష్ సంజయ్ టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, అనిల్ కిషోర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, ఉదయ, కుట్టి, ఉమేష్, రాందాస్, ఎజిపి రావు, రత్నకుమారి, రాజేష్, దాస్, రమేష్, రాజు, భాస్కర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.