కాలనీ ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: కార్పొరేటర్ మొద్దు లచి రెడ్డి

నూతనంగా ఎన్నికైన కాలనీ ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు.     బి .యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ నూతన కాలనీ సంక్షేమ సంఘం ఏర్పరచుకున్న సందర్భంగా సంఘం సభ్యులు  ఆదివారం బి యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డికి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది , కాలనీ లోని సమస్యలు వివరించడం జరిగింది.
స్పందించిన కార్పొరేటర్  కాలనీలోనీ ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ముడుపు సందీప్ రెడ్డి, ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఆది లక్ష్మి, నాయకులు పవన్ రెడ్డి, కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, ఉపాధ్యక్షులు శంకర్ నాయక్, సలహాదారులు పురుషోత్తం, బిక్షమయ్య, గౌడ సంఘం అధ్యక్షులు బిక్షమయ్య గౌడ్, చారి సంఘం అధ్యక్షులు మధుకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.