కాలుష్య కోరల్లో భారత్
– ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా గురుగావ్
– 20అత్యంత కాలుష్య నగరాల్లో 15 ఇండియాలోనే!
– కాలుష్య నగరాల్లో 11వ స్థానంలో ఢిల్లీ
– చైనాలో 40 శాతం తగ్గిన కాలుష్యం
– ఎయిర్ విజువల్ అండ్ గ్రీన్పీస్ సంస్థ వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి5(జనంసాక్షి) : ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా భారత్ మారుతోంది. ప్రపంచం దేశాల్లో 20 అత్యంత కాలుష్య నగరాల్లో 15 ఇండియాలోనే ఉన్నట్లు ఎయిర్ విజువల్ అండ్ గ్రీన్ పీస్ సంస్థ మంగళవారం డేటాను విడుదల చేసింది. ఈ డేటాను బట్టి మన దేశంలో ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ప్రపంచంలోని 20అత్యంత కాలుష్య నగరాల్లో 15మన దేశంలోనే ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టాప్ 10 కాలుష్య నగరాల్లో కూడా ఏడు భారత్ లోనే ఉన్నాయి. మిగిలిన మూడింట్లో ఒకటి చైనా (¬టన్), రెండు పాకిస్థాన్ (ఫైసలాబాద్, లా¬ర్)లో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) లో ఉండే గురుగావ్ నిలిచింది. ఇతర భారత నగరాల్లో ఘజియాబాద్, ఫరీదాబాద్, భివాండీ, నోయిడా, పాట్నా, లక్నోలు ఉన్నాయి. అత్యంత కలుషిత 11వ నగరంగా ఢిల్లీ నిలిచింది. పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) 2.5 ఆధారంగా ఈ కాలుష్యాన్ని కొలిచారు. గాలిలో ఘన, ద్రవ కణాలు కలిసిపోయి ఉండటాన్ని పీఎం 2.5 ద్వారా కొలుస్తారు. పీఎం 2.5 కాలుష్యానికి గురైన వారు శ్వాస సంబంధిత వ్యాధులతో (ఆస్తమా వంటివి) బాధపడతారు. దీనికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారైనా దీనికి బాధితులుగా మారాల్సిందే. కాలుష్యాన్ని నియంత్రించడంలో చైనా ఎంతో పురోగతిని సాధించింది. 2013లో ఆ దేశ రాజధాని బీజింగ్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. దీంతో, చైనా ప్రభుత్వం కాలుష్యాన్ని నియంత్రించడానికి అప్పటి నుంచి యుద్ధ ప్రాతిపదికన కట్టుదిట్టమైన కార్యాచరణను అమలు చేసింది. దీంతో, దేశంలోని కాలుష్యం ఏకంగా 40శాతం తగ్గింది. ఈ విషయంలో చైనా నుంచి మనం చేర్చుకోవాల్సింది చాలా ఉందనే విషయం అర్థమవుతోంది.