కాశ్మీర్లో తగ్గిన ఉష్ణోగ్రతలు
దేశమంతటా ఎండలు మండిపోతుంటే.. కాశ్మీర్ లో మాత్రం ఒక్కసారిగా వాతావరణం ఛేంజ్ అయింది. అక్కడ గత 24 గంటల నుంచి జల్లులు కురుస్తున్నాయి. చలిగాలులు వీస్తున్నాయి. దీంతో దాదాపు 30 డిగ్రీలుగా ఉన్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 18 డిగ్రీల దిగువకు పడిపోయాయి. ఈ ఆకస్మిక మార్పుతో జనానికి ఎండల నుంచి ఉపశమనం లభించినప్పటికీ.. రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చలిగాలుల కారణంగా పండ్ల తోటల్లో కాత రాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.