కాశ్మీర్ చీఫ్ జస్టిస్గా గీతా మిట్టల్
శ్రీనగర్,ఆగస్ట్4(జనం సాక్షి): జమ్మూ కాశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ గీతా మిట్టల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దేశ వ్యాప్తంగా పలు రాష్టాల్ర హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తలను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కల్పేశ్ సత్యేంద్ర జువేరీ, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ విజయ్ కమలేష్ తహిల్ రమణి, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ముఖేష్ కుమార్రాషిక్ భాయ్ షాలను నియమించింది. కాగా, జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు జస్టిస్ గీతా మిట్టల్ తొలి మహిళా చీఫ్ జస్టిస్ కావడం విశేషం.