‘కుడంకుళం’ పై తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీం

న్యూ ఢిల్లీ,డిసెంబర్‌ 6 (జనంసాక్షి): తమిళనాడులోనూతనంగా నిర్మించిన కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రంపై తీర్పును సుఫ్రీంకోర్టు రిజర్వ్‌లో వుంచింది. అణువిద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపట్టేవరకు స్టే విధించాలని అణువిద్యుత్‌ కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్న సంఘాలు పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై న్యాయమూర్తులు రాధాకృష్ణన్‌, దీపక్‌మిశ్రా లతో కూడిన బెంచ్‌ విచారణ చేపట్టింది. సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్‌లో వుంచింది.