కురియస్‌ మ్యాథ్యూస్‌ ఘరానా మోసం

రంగారెడ్డి: దుండిగల్‌లో డాన్‌బాస్కో పాఠశాల డైరెక్టర్‌ కురియస్‌ మ్యాథ్యూస్‌ ఘరానా మోసానికి పాల్పడ్డారు. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో రూ. 4 కోట్లు వసూలు చేసి మ్యాథ్యూస్‌ పరారయ్యారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌కు మ్యాథ్యూస్‌ పాఠశాలను విక్రయించినట్లు సమాచారం. నెల రోజుల నుంచి మ్యాథ్యూస్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మ్యాథ్యూస్‌పై దుండిగల్‌ పీఎస్‌లో కేసు నమోదైంది.