కుర్తిరావుల చెరువు మాజీ కో ఆప్షన్ సభ్యుడు చిన్న సుల్తాన్ మియా మృతి

మల్దకల్ జూలై 14 (జనంసాక్షి) మల్దకల్ మండలం కుర్తిరావుల చెరువు గ్రామానికి చెందిన సుల్తాన్ మియా(89) బుధవారం రాత్రి పదిగంటల సమయంలో భౌతికంగా పరమవదించారు.తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు   సుల్తాన్ మియా అప్పటి మాజీ ఎంపీపీ ఎల్కూరు వెంకట్రాంరెడ్డి హాయంలో మల్దకల్ మండల కో ఆప్షన్ సభ్యుడుగా విశిష్ట సేవలందించడం జరిగింది.గ్రామస్థుల సమాచారం మేరకు సుల్తాన్ మియా యుక్త వయసులో నుండే సామాజిక స్పృహ కలిగివుండి అందరం ఒక్కటేనంటు భావన చాటుతూ గ్రామీణ ప్రజాసమస్యలపై ఆనాడే ప్రజాప్రతినిధుల అధికారుల దృష్టికి తీసుకెళ్లి తనవంతుగా పరిష్కరించే మార్గంలో ” గొప్ప దిట్ట” అని మంచి పేరు వుంది.సుల్తాన్ మియా అంత్యక్రియలు స్వగ్రామమైన కుర్తి రావుల చెరువు లో గురువారం అంత్యక్రియలు నిర్వహించున్నట్లు మాజీ కో ఆప్షన్ సభ్యుడు మహబూబ్ వలి తెలిపారు.నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ రంజిత్ కుమార్ ఆయన భౌతికాయం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు.