కె జి వి బి హాస్టల్లోకి ప్రవేశించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

 

రాజకీయ నాయకుల ప్రమేయంతో నీరు గార్చే ప్రయత్నం

కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన తె జ స నాయకులు

ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 29 ,(జనం సాక్షి )
ఆగష్టు 17 న ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ హాస్టల్ లోనికి అక్రమంగా ప్రవేశించి విధ్యార్థినుల పై దాడికి ప్రయత్నించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నాన్ బెయిల్ కేసులు నమోదు చేయాలని , ఈ విషయం మీద ఉన్నత స్థాయి అధికారులతో పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జన సమితి నాయకులు సోమవారం నాడు జగిత్యాల కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు మాట్లాడుతూ హాస్టల్ లోకి ప్రవేశించిన దుండగులను కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయంతో కేసుల నుండి తప్పించినారని , వార్తలు వచ్చినందున ఇట్టి విషయంపై ఉన్నత అధికారులను విచారణ అధికారులుగా నియమించి విచారణ జరిపించాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, హాస్టల్ విధ్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. జిల్లపెళ్లి దిలీప్ కుమార్ జిల్లా విద్యార్థి అధ్యక్షులు ,
చింతకుంట శంకర్
జిల్లా కార్యదర్శి ,కంతి రమేష్ మండల అధ్యక్షులు.తరుణ్ , కంతి లింగారెడ్డి పాల్గొన్నారు.