కేంద్ర పోలీస్‌ మెడల్స్‌ ప్రకటన

న్యూఢిల్లీ,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): పంద్రాగస్టును పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీస్‌ మెడల్స్‌ను ప్రకటించింది. ఏటా మెడల్స్‌ ప్రకటించి సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరు రాష్ట్రపతి పురస్కారాలకు, 14 మంది పోలీసు పథకాలకు ఎంపిక అయ్యారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు రాష్ట్రపతి పురస్కారాలు, 10 మంది ప్రతిభా పురస్కారాలకు ఎంపిక అయ్యారు. వివిధ సందర్భాల్లో వీరి ధైర్సాహసాలకు గుర్తుగా వీరిని ఎంపిక చేశారు.