కొత్త పార్లమెంట్ సాక్షిగా.. తెలంగాణపై మోడీ మళ్ళీ వంకర మాటలు


న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి మోడీ మరోసారి వంకర మాటలు మాట్లాడారు. గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని వ్యాఖ్యలు చేసిన ఆయన.. రాష్ట్ర విభజనని తలుపులు మూసి విభజించారని ఓ ప్రాంతంపై విద్వేషపూరితంగా వ్యవహరించారు. తాజాగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలోనూ తెలంగాణపై మోడీ తన అక్కసు వెళ్లగక్కారు. ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదని, ఈ విభజన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వర్గాలకు సంతృప్తి కలిగించలేకపోయిందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో కష్టంతో జరిగిందని, రక్తం చిందించాల్సి వచ్చిందన్నారు. నూతన రాష్ట్రం వచ్చినా తెలంగాణ వేడుకలు జరుపుకోలేకపోయిందని మోదీ వ్యాఖ్యానించారు. మోడీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రులు, పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.