కొత్త పింఛన్లు పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ

మల్దకల్ అక్టోబర్10 (జనంసాక్షి) మండల పరిధిలోని మద్దెలబండ గ్రామ పంచాయతీలో సోమవారం కొత్త పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు పింఛన్లను వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న,గ్రామ సర్పంచ్ కొత్తింటి జయమ్మ నారాయణ,గ్రామపంచాయతీ కార్యదర్శి మారెప్ప,పింఛన్లు పంపిణీ చేశారు.అదేవిధంగా నాగర్ దొడ్డి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో కొత్త పింఛన్లను గ్రామ సర్పంచ్ సువార్తమ్మ ,ఎంపిటిసి సరోజమ్మ మహేష్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో  ఉపసర్పంచ్ బ్యారం శంకరమ్మ, నాగర్ దొడ్డి ఉపసర్పంచ్ ఉరుకుందమ్మ నాగేంద్ర ,గ్రామ కార్యదర్శి కిరణ్,టిఆర్ఎస్ నాయకులు రాజు,పిఏ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.