కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని గోడౌన్ కు పంపించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి గోడౌన్ కు పంపించాలని కొనుగోలు నిర్వాహకులను పిఎస్సిఎస్ చైర్మన్ గట్టు బాలకృష్ణారెడ్డి ఆదేశించారు సహకార సొసైటీ ద్వారా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు  ధాన్యం లో తేమ ఉంటే ఆరబోయాలని తేమ శాతం తగ్గిన తర్వాత సంచులలో పోసి తూకం వేసి గోడనుకు వెంటనే త్వరితగతిన పంపించాలని ఆయన ఆదేశించారు రైతులు తొందరగ ధాన్యం తీసుకురావాలని అకాల వర్షాలు పడి అవకాశాలు ఉన్నందున వెంటనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని ఆయన రైతులను కోరారు ఎంత ధాన్యం ఉన్న కొనుగోలు కేంద్రాలు కొంటాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి చంద్రశేఖర్ శ్రీహరి నరసయ్య తదితరులు పాల్గొన్నారు