కోతకు గురైన ఖమ్మం-రాజమండ్రి రోడ్డు

ఖమ్మం: నీలం తుపాను కారణంగా గత రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద ఉదృతికి సత్తుపల్లి వద్ద రాజమండ్రి-ఖమ్మం ప్రధాన రహదారి కోతకు గురైంది. దీంతో ఈ రోడ్డుపై వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీ ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.