కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారశైలి జుగుప్సాకరం

మార్కెట్ కమిటీ మాజీ చెర్మెన్ సత్తు వెంకటరమణా రెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-పదవులకోసం, కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స వ్యవహరిస్తున్నతీరు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నదని మార్కెట్ కమిటీ మాజీ చెర్మెన్ సత్తు వెంకట్ రమణా రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా నిలిచిన రాజ్ గోపాల్ రెడ్డికి ఓటువేయమని, సహకరించమని కాంగ్రెస్ పార్టీ లో ఉండి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరుతుండడం వారి దివాళాకోరు రాజకీయాలకు నిదర్శన మని అన్నారు సిద్దాంతపరంగా కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా బిజెపి పార్టీకి సహకరించమని చెప్పడం, భవిష్యత్తులో తానే కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడవుతానని చెప్పడం చూసిన కోమటిరెడ్డి బ్రదర్స్ ను ప్రజలు ఈసడించుకుంటున్నారు. భువనగిరి పార్లమెంటులో ప్రతినిదిగా ఉన్న వెంకటరెడ్డి ఈ నియోజక వర్గంలో తనకు ఓట్లేసిన ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. పద్దెనిమిది వేల  కోట్ల  కాంట్రాక్ట్ కోసం రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరితే, ఆ కాంట్రాక్టులో వాటా కోసం వెంకటరెడ్డి అతడికి సహకరిస్తున్నాడని అన్నారు. బిజెపి అభ్యర్థికి ఓటు వేయమని కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి చెబుతున్న ఆడియో రికార్డింగ్ లు వైరల్ అవుతున్నా ఎంపి వెంకట్ రెడ్డి పై కాంగ్రెస్, పార్టీ అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో ప్రజలకు స్పష్టం చేయాలని అన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్టు బ్రదర్స్ అని వారం క్రితమే చెప్పిన కెటిఆర్ మాటల్లోని వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ మంచిపనులు చేస్తుందని విశ్వసిస్తే సహకరించండని బిజెపి నాయకుడికి కెటిఆర్ ఫోన్ చేస్తే దానికి పెడార్థాలు తీసిన బిజెపి, కాంగ్రెస్ నాయకులు నీతిమాలిన కుమ్ముక్కు రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు  మునుగోడు ఎన్నికలలో ఆ రెండు పార్టీలకు కర్రు కాల్చి వాతపెట్టనున్నారని అన్నారు