కోర్టులో హాజరుకానున్న నీరా రాడియా
ఢిల్లీ : మాజీ కార్పొరేట్ లాబీయిస్ట్ నీరారాడియా మే 28న ఢిల్లీ కోర్టులో హాజరుకానున్నారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కేసులో ప్రాసిక్యూషన్ సాక్షిగా ఆమె కోర్టును హాజరు కానున్నారు. మే 28న వాంగ్మూలాలు నమోదు చేయనున్న ప్రాసిక్యూషన్ సాక్షుల వివరాలను సీబీఐ ఈరోజు న్యాయమూర్తి ఓ.పి. సైనీ ముందు సమర్పించింది.