కోల్‌కతాలో కూలిన మరో వంతెన

కోల్‌కతా,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కక్డ్విప్‌ ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న వంతెన సోమవారం కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోయినట్లు సమాచారం అందలేదని జిల్లా మేజిస్టేట్ర్‌  వై.రత్నాకరరావు పేర్కొన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఒక బృందాన్ని సంఘటనాస్థలానికి తరలించామని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. కాగా, ఈ సెప్టెంబర్‌లోనే వంతెన కూలిపోయిన
ఘటనల్లో ఇది మూడవది. సెప్టెంబరు 4 న దక్షిణ కోల్‌కతాలోని మజెర్హాట్‌ వంతెన కూలిపోయిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. మూడు రోజుల అనంతరం ఉత్తర బెంగాల్లో సిలిగురి సవిూపంలో పాత వంతెన కూలిపోయింది.