క్యాన్సర్ బాధితునికి ఆర్థిక సహాయం అందజేసిన 2006-2007 బ్యాచ్

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 7 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామానికి చెందిన ఎడ్ల సాయి బాబాకు ముగ్గురు కొడుకులు చిన్నకొడుకు ఎడ్ల మహేందర్ కి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది వయసు 14 సంవత్సరాలు నిరుపేద కుటుంబం రోజు కూలికి వెళితే కానీ పూట గడవని పరిస్థితి హాస్పిటల్ లో చికిత్సకు ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఏమి చేయని పరిస్థితిలో ఉండి ఇంటి దగ్గరనే టాబ్లెట్స్ వాడుతున్నారు విషయం తెలుసుకున్న పల్లెర్ల గ్రామానికి చెందిన పదవ తరగతి 2006-2007 బ్యాచ్ మిత్రులు 8000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు అలాగే వారి కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం ఆదుకోవాలని మరికొంత మంది ముందుకు వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సామ నరేందర్ రెడ్డి దండు ప్రసన్న ముదిరాజ్ వస్పపరి కృష్ణ జినుకల మల్లేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు