క్రీ. శే దేవవరపు సీతారామయ్య చిరస్మరణీయుడు – 22వ వర్ధంతిలో ఘనంగా నివాళులు

టేకులపల్లి, ఆగస్టు 17( జనం సాక్షి ): క్రీస్తు శేషులు దేవవరపు సీతారామయ్య దశాబ్దాల కాలం క్రితం దట్టమైన అటవీ ప్రాంతమైన కొప్పురాయి గ్రామంలో ఉపాధ్యాయ బోధకుడిగా చేరి పిల్లలకే కాకుండా అక్కడ నివసిస్తున్న ఆదివాసి గిరిజనులకు ఆయన గురువుగా మారి వారి జీవనశైలిని మార్పులు తీసుకువచ్చిన మహనీయుడని చిరస్మరణీయుడని పలువురు కొనియాడారు.  టేకులపల్లి మండలం కొప్పురాయి గ్రామంలో సీతారామయ్య 22వ వర్ధంతి సందర్భంగా బుధవారం బోడు, కొప్పురాయి పరిసర గ్రామాల నుండి గిరిజనులు, ప్రముఖులు చేరుకొని పుణ్య దంపతుల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సీతారామయ్య ఆయన సతీమణి ఇందిరావతి  గిరిజన గ్రామాలలో తండాలలో విద్య బోధనను అందించి ఉత్తమమైన బోధనను అందించాలని లక్ష్యంతో అదే గ్రామంలో  మారుమూల దట్టమైన అడవి ప్రాంతమైనప్పటికీ అమాయక గిరిజనుల కోసం అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పి గొప్ప స్థాయిలోకి ఎందరినో చేరుకునే విధంగా చేసిన మహానీయుడని అందుకే ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనుల ప్రతి ఒక్క హృదయంలో ముద్ర వేసుకొని ఆ పుణ్య దంపతులకు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనాగరికతగా జీవనం సాగిస్తున్న ఆదివాసి గిరిజనులకు నాగరికతపై మక్కువ కల్పించిన మహా వ్యక్తిని గ్రామస్తులు కొనియాడారు. అలాంటి మహనీయునికి తరతరాలుగా ఆయన మా గుండెల్లో గూడు చెదరకుండా ఉంటారని వారి పేర్కొన్నారు .దేవవరపు సీతారామయ్య ఇందిరావతి దంపతులకు ఓ కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. వారు కూడా తండ్రి బాటలోనే ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతూ అదే సేవాగుణంతో ఎందరికో సహాయపడుతూ ఆయన కుమారుడు దేవవరపు వెంకటేశ్వరరావు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిఆర్టియు జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాటాలు చేస్తూ ఎన్నో సాధించుతూ పలువురు మనలను పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు బొప్పెన వెంకటేశ్వర్లు, జార గుటయ్య ,కల్తీ శ్రీను, జార సరస్వతి, పునేం శ్రీలత, యువకులు ఈసాల రవి దొర,పాఠశాల ప్రధానోపాధ్యాయులు  బి. బాలాజీ, పి ఆర్ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు తేజావత్ రవీందర్, పి ఆర్ టి యు టేకులపల్లి మండల అధ్యక్షుడు గుగులోతు మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.