ఖేడ్ నియోజకవర్గని అభివృద్ధిచేసింది టీఎస్ ఎస్ ప్రభుత్వం
నారాయణఖేడ్ జూలై22(జనంసాక్షి)
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ని
కంగ్టి మండల్ దేగుల్ వాడి, గ్రామం నుండి రామ్ చందర్ తండా వరకు ఒక్క కోటి 60 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన మంత్రులు హరీష్, రావు సత్యవతి రాథోడ్,ఎం భూపాల్ రెడ్డి,
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ
ఆ రోజుల్లో నారాయణఖేడ్ నుండి కంగ్టి కి రావాలన్నా రోడ్డుపైన చుక్కలు కనపడేవి.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నారాయణఖేడ్ నుండి కంగ్టి వరకు రోడ్డును రెండు లైన్లుగా మార్చాం అని అన్నారు.
ఇవాళ నారాయణఖేడ్లో లోని ఏ తాండకు వెళ్లిన బిటి రోడ్లను నిర్మించి ఘనత టీఎస్ ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.
నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో వాళ్ల ఆస్తుల గురించి వాళ్ళ పదవుల గురించి ఆలోచించారు తప్ప రోడ్ల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో రాత్రి వేసిన రోడ్డు పొద్దుగాల వరకు ఉండేది కాదని వాళ్ళు వేసిన బీటీ రోడ్లో ఒక నెల రోజుల్లోనే గడ్డి మొలుస్తుండేది అని ఆయన అన్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలలో 36 కోట్లతో అన్ని తండాలకు బీటీ రోడ్లు నిర్మించాం మరియు ఐదు కోట్లతో సీసీ రోడ్లు నిర్మించడం జరిగిందని.
ఈరోజు మా గిరిజన సోదరుల 54 తండాలకు గ్రామపంచాయతీలుగా గుర్తించాం వారి పాలన వారు చేసుకునే విధంగా తీర్చిదిద్దాం.
ఈ 54 తాండాలలో ఉన్న గ్రామపంచాయతీలకు ఒక్కొక్క దానికి 25 లక్షల చొప్పున గ్రామ పంచాయతీలు నిర్మించుకోవడానికి డబ్బులు మంజూరు చేస్తామని అన్నారు.
ప్రస్తుతం ఇంకా కొన్ని తాండాలలో బీటీ రోడ్లు నిర్మించవలసి ఉందని అక్క మంత్రి సత్యవతి రాథోడ్ సహకారంతో వాటిని కూడా నిర్మించే విధంగా చూస్తామని అన్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో తాండాలలో కరెంటు ఉండేది కాదు కానీ మా ప్రభుత్వం వచ్చాక సింగల్ ఫేస్ తో పాటు త్రీఫేస్ కరెంటుతో వ్యవసాయానికి కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో 70 సంవత్సరాలలో నారాయణఖేడ్లో ఒక్క గిరిజన గురుకుల పాఠశాల ఉండేది కాదని ప్రస్తుతం నారాయణఖేడ్లో నాలుగు గిరిజన గురుకుల పాఠశాలలు ప్రారంభించామని అన్నారు.
ఒకప్పుడు కంగ్టి మండల్ గ్రామాలలో నులక మంచం పైన స్నానాలు చేసి ఆ నీళ్లతోనే బాసన్లు తోమేవారని అన్నారు.
మా అక్క చెల్లెలు నీళ్లు తెచ్చుకోవాలంటే కిలోమీటర్ల దూరం నుండి వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చేదని ఇప్పుడు ఇంటింటికి నల్ల బిగించామని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు రైతుబంధు డబ్బులు తీసుకొని ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని మురుస్తున్నారు. బయటికి వచ్చాక టిఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు అని అన్నారు.
దేగుల్ వాడి, గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలోనే కర్ణాటక ఉంది. అక్కడ పింఛన్ ఎంత ఇస్తున్నారు. మన దగ్గర ఎంత ఇస్తున్నారు. మీకైతే తెలుసు అక్కడ రూ. 600 ఇస్తున్నారు. మన వద్ద రూ. 2000 ఇస్తున్నాం మరి బిజెపి వాళ్లు డబ్బుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు. వాళ్లు వస్తే పింఛన్ మళ్లీ రూ.600 అవుతుందని ఆయన అన్నారు.
పెద్దగా మాట్లాడే బిజెపి నాయకులు ఢిల్లీలో బిజెపి ఉంది. కర్ణాటకలో బిజెపి ఉంది. మరి రైతుబంధు. వృద్ధాప్య పింఛన్. కళ్యాణ లక్ష్మి. రైతు బీమా ఎందుకు ఇవ్వడం లేదు అని ఆయన అన్నారు.
కర్ణాటక మైలాలు బిందెలు తీసుకొని వచ్చి మన నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నాగల్ గిద్ద, మండల్ కరస్ గుత్తి, గ్రామం నుండి మిషన్ భగీరథ నీళ్లు పట్టుకు వెళుతున్నారు. అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ నుండి కర్ణాటక వెళ్లి మహిళలు డెలివరీలు చేసుకునే వారని ఇప్పుడు అది రివర్స్ తిరిగి కర్ణాటక నుండి మహిళలు వచ్చి తెలంగాణలోని నారాయణఖేడ్, సంగారెడ్డి లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరులు చేసుకుంటున్నారని అన్నారు.
బిజెపి వాళ్లయి అన్ని జూటా మాటల్ ఏమి చేసింది ఉండదు. మాట్లాడితే జూట మాటల్, బిజెపి వాళ్లు మాట్లాడితే అబద్ధాల పుట్ట ఈ బీజేపీ వాళ్ళ మాటలు వేరే వారికి అర్థం హైతదో లేదో కానీ ఈ దేగుల్ వాడి ప్రజలకు బాగా అర్థమైతది అన్నారు.
తెలంగాణ ప్రజల బతుకులు మారాయి అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 7 ఏళ్ల కాలంలోనే మారాయని అన్నారు.
నారాయణఖేడ్ లో మాత శిశు సంక్షేమ హాస్పిటల్ కట్టిస్తున్నాం , టి డయాగ్నస్ సెంటర్ ప్రారంభిస్తాం. అని ఆయన అన్నారు.తధానతరం ఖేడ్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల
సమావేశంలో
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారులకు స్వయంగా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస అని పేర్కొన్నారు , అనంతరం నారాయణఖేడ్ లోని గాంధీ చౌక్ నుండి అనుమాన్ మందిర్ వరకు సీసీ రోడ్డుకు కోసం శంకు స్థాపన చేశారు. అనంతరం 25 కోట్లతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరుచేశారు.ఈకార్యక్రమంలో అధికారులు అనధికారులు పాల్గొన్నారు.

Attachments area