గంజాయి మాఫియా అరెస్టు

రోలుగుంట : విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు ఈ రోజు నర్సీపట్నం, మాకవరపాలెం, గోలుగొండ మండలల్లో దాడులు చేసి 1650 కిలోల గంజాయిని సట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ. 50లక్షల లోలుంటుందని అంచనా, దినితో సంబంధమున్న 10మందిని అరెస్టు చేశారు. వీరితో పాటు ఒక వ్యాను, లారీ, ఇండికా కారు, రెండు ద్విచక్రవాహనాలు రూ. 70 వేల నగదును స్వాదీనం చేసుకున్నారు. ఈ గంజాయి వ్యాపారంలో ముంబాయి మాఫియాకు సంబంధాలు ఉన్నట్లు తమ దర్యాప్తులో తెలిందని నర్సీపట్నం ఏఎస్పీ తప్సీర్‌ ఇక్బాల్‌ తెలియజేశారు.