గణపతి ఉత్సవాల సందర్భంగా శాంతియుత కమిటీ సమావేశం….

ఎస్సై మమ్మద్ గౌస్..

చిలప్ చేడ్/25ఆగస్టు/జనంసాక్షి :- మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో గణపతి ఉత్సవాల సందర్భంగా శాంతియుత కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎస్సై మహ్మద్ గౌస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాలకు సంబంధించిన గణపతి ఉత్సవాల కమిటీ సభ్యులు యువజన సంఘాల సభ్యులు ప్రజాప్రతినిధులు గణపతి ఉత్సవాల సందర్భంగా శాంతియుత కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది వారికి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలు సూచనలు చేయడం జరిగింది ఆయా గ్రామాలలో ఏర్పాటు చేస్తున్నటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద సౌండ్స్ గాని ఇతర అల్లర్లు జరగకుండా గణపతి ఉత్సవ కమిటీ సభ్యులే చూసుకోవాలి అలాగే మండపాల వద్ద విద్యుత్ సమస్య ఏర్పడితే స్థానికంగా ఉండే లైన్మెన్లను సంప్రదించి విద్యుత్ సమస్యను పరిష్కరించుకోవాలి అలాగే గ్రామాలలో నవరాత్రుల ముగింపు సందర్భంగా ఊరేగింపులు జరిగేటప్పుడు గ్రామాలలో ఎటువంటి అల్లర్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గణపతి నిమర్జనం సమయంలో యువకులు చిన్న పిల్లలు చేరువుకుంటలలో లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని గణపతి నవరాత్రి సందర్భంగా మండపాల వద్ద గ్రామంలోఎటువంటి ఇబ్బందులు ఏర్పడ్డ గణపతి కమిటీ సభ్యులు తమ దృష్టికి తీసుకురావాలని అలాగే గ్రామంలో ఉన్నటువంటి యువజన సంఘాలు ప్రజాప్రతినిధులు నవరాత్రుల్లో భాగంగా పాలుపంచుకొని గ్రామంలో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్సై ముహమ్మద్ గౌస్ పోలీస్ సిబ్బంది ఆయా గ్రామాల నుంచి వచ్చిన యువజన సంఘాల సభ్యులు