గణపతి నిమజ్జనోత్సవానికి డీజే సౌండ్ సిస్టం వినియోగించడం నిషేధం

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26 (జనం సాక్షి)
 గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించి రేపు అనగా తేదీ 27-09-2023 రోజు నిమజ్జనం కు వెళుతున్న క్రమంలో ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిమజ్జోత్సవం నిర్వహించుకోవాలని తెలియజేస్తున్నాము. ఈ మేరకు మడ్డవాడ సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు
1) డీజే సౌండ్ సిస్టం వినియోగించినటువంటి వారిపై కేసు నమోదు చేసి డీజే సౌండ్ సిస్టం సీజ్ చేసి కోర్టుకు అప్పగించడం జరుగుతుంది
2) ఎవరైనా నిమర్జనం ఉత్సవాలలో సౌండ్ సిస్టం వాడినా, మద్యం సేవించి ఉత్సవాల్లో పాల్గొన్నా, మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
3)నిమజ్జన సమయంలో సాధారణ ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోగలరు.
4)మీ యొక్క విగ్రహాలను వీలైనంత తొందరగా నిమజ్జనం కొరకు చెరువు వద్దకు తీసుకొని వెళ్ళగలరు.
5)నిమర్జనం ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే పోలీస్ వారికి సమాచారం అందజేయగలరు.
డయల్ 100
సీఐ వెంకటేశ్వర్లు మట్టవాడ-8712685117,
ఎస్సై విటల్-8712685091,
ఎస్సై నవీన్-8712685090,
ఎస్సై కుమార్-87125 84634.
కావున ప్రజలందరూ గణపతి నిమర్జన ఉత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో ప్రశాంతంమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు