గణపతి మండపం వద్ద అన్నవితరణ

టేక్మాల్  జనం సాక్షి సెప్టెంబర్ 3 టేక్మాల్ మండల కేంద్రంలోని పబ్బతి హనుమాన్ ఆలయంలో  కొలువైన గణపతి మండపం వద్ద దొడ్ల శ్రీనివాస్ దంపతులు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం మండపంలో ఏర్పాటు చేసిన గణపతికి  ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతు నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్దలతో, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రశాంత వాతావరనంలొ జరుపుకోవాలి అన్నారు. శ్రీనివాస్ దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు మరియు  సర్పంచ్ సుప్రజా భాస్కర్, నవీన్ గుప్తా శాలువాతో సత్కరించారు.