గణితంలో పరిశోధన కు డాక్టరేట్ పట్టా పొందిన ఉప్పునుంతల వాసి బొల్లే పర్వతాలు.

అచ్చంపేట ఆర్సీ,అక్టోబర్16, (జనం సాక్షి న్యూస్): నియోజకవర్గ పరిధిలోని ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన బొల్లే చిన్నయ్య తనయుడు బొల్లే పర్వతాలు కర్ణాటక విశ్వవిద్యాలయం ధారవాడ లో గణితం లో పి హెచ్ డి ఉన్నత విద్యను చదువుతూ గణితంలో “సమ్ అస్పెక్ట్స్ ఆఫ్ స్పెక్ట్రా ఆఫ్ గ్రాఫ్స్ “అనే అంశం మీద పరిశోధనకు సంబంధించి గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. తన పరిశోధనలో ప్రొఫెసర్ హెచ్ ,ఎస్ రామన్ ,సూర్యనారాయణ, బసవన్న గౌడ్, ఎస్ సి శిరళ శెట్టి, ఆర్ ఎస్ ద్యావనల్ , పర్యవేక్షణ వారి సహకారం అందించారు. శనివారం నాడు తను గణితంలో చేసిన పరిశోధనకు గాను పిహెచ్ డి పట్టా ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ లు,పి హేచ్ డి స్కాలర్స్ ,కుటుంబ సభ్యులు చింత గాళ్ల సుధాకర్, చింతగాళ్ల రాజు పాల్గొన్నారు.