గణేశ్ మండపాలకు తిలక్ ఫొటోలు పంపిణీ..

 బేల, సెప్టెంబర్ 2 ( జనం సాక్షి) : మండల కేంద్రంలోని గణేశ్ మండపాల వద్ద బాలగంగాధర్ తిలక్ ఫొటోలను సార్వజనిక్ గణేశ్ మండలి సభ్యులకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి అంద జేశారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసినిరెడ్డి మాట్లాడుతూ..తిలక్ సార్వజనిక సమితి పేరుతో ప్రజలను ఐక్యం చేసేందుకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ నవ రాత్రి ఉత్సవాలకు గుర్తుగా తిలక్ ఫొటోలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఓల్లఫ్ వార్ జ్యోతి, నాయకులు బోనిగిరివార్ గణేశ్,వేణుగోపాల్,నరేష్,ప్రమోద్ రెడ్డి,శివ కిరణ్,తదితరులు పాల్గొన్నారు..