గతేడాది 50వేల మందికి అమెరికా పౌరసత్వం

వాషింగ్టన్‌, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : గతేడాది 50వేల మందికిపైగా భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని పొందారని తాజా అధికారిక ప్రకటనలో వెల్లడైంది. అంతకుముందు సంవత్సరం(2016)తో పోల్చుకుంటే నాలుగువేల మందికి పైగా పౌరులకు అదనంగా పౌరసత్వం మంజూరైందని తెలిపింది. 50,802 భారతీయులు యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ను పొందినట్లు ¬మ్‌లాండ్‌ సెక్యూరిటీ 2017 సంవత్సరానికి విడుదల చేసిన వార్షిక వలసల నివేదికలో పేర్కొంది. 2016లో ఆ సంఖ్య 46,188. 2015లో 42,213మంది పౌరసత్వాన్ని పొందారు. 2015తో పోల్చుకుంటే 8,000 మంది అదనంగా అమెరికన్‌ పౌరులుగా మారారు.
మొత్తంగా 2017లో 7,07,265 మంది విదేశీయులు యూఎస్‌ పౌరసత్వాన్ని సొంతం చేసుకున్నారు. 2016లో ఆ సంఖ్య 7,53,060 కాగా 2015లో 7,30,259. విదేశీయుల్లో అమెరికన్‌ పౌరసత్వం పొందినవారిలో మెక్సికన్లు(1,18,559) మొదటి స్థానంలో ఉండగా, భారత్‌ రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో చైనా(37,674), ఫిలిప్పైన్స్‌(36,828), డొమినిక్‌ రిపబ్లిక్‌(29,734), క్యూబా(25,961)లు ఉన్నాయి. పౌరసత్వం పొందిన వారిలో పురుషుల( 3,10,987) కంటే మహిళల(3,96,234) సంఖ్యే అధికం కావడం గమనార్హం. అలాగే కొత్తగా యూఎస్‌ పౌరులుగా మారిన భారతీయులు కాలిఫోర్నియాలో నివసించడానికి మొగ్గు చూపుతున్నారని నివేదిక వివరించింది. న్యూజెర్సీ , టెక్సాస్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.