గనిలో ప్రమాదం: 19 మంది గల్లంతు

, హైదరాబాద్‌: చైనాలోని షాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం జిప్సమ్‌ గనిలో ప్రమాదం సంభవించింది. ఒక్క ఉదుటున గని కూలిపోవడంతో అందులో పనిచేస్తున్న 29 మంది లోపల చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపట్టారు. నలుగురిని బయటికి తీయగలిగారు. మరో ఆరుగురి ఆచూకీ లభ్యమవడంతో వారిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా 19 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు